ప్రజాశక్తి-ఇంటర్నెట్ : భీమవరం సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య X వేదికగా తనదైన శైలిలో చురకలంటించారు. ”50 ఏళ్లు పైబడిన వయసులో బాధ్యత కలిగిన పదవిలో ఉండి పది మందికి మంచి చెప్పాల్సింది పోయి, ప్రత్యర్థి నాయకుని వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించడం తప్పు కాదా, సభ్యత సంస్కారాలు మరచి మీరే ఇలా అయితే ఎలా” అని వర్ల Xలో కామెంట్ చేశారు.