AP Polling – రాత్రి 12 గంటలవరకు జిల్లాలవారీగా పోలింగ్‌ శాతం ఎంతంటే ?

May 14,2024 12:03

అమరావతి : ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎపిలో ఓటర్లు పోటెత్తారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ నమోదయింది. పోలింగ్‌ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పోలింగ్‌ ట్రెండ్‌ ప్రకారం… 80 శాతం ఓటింగ్‌ దాటేలా కనిపిస్తోంది. 2009 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో 75.9 శాతం, 2014 ఎపి ఎన్నికల్లో 78.4 శాతం, 2019 శాసనసభ ఎన్నికల్లో 79.6 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. 2024లో మాత్రం సాయంత్రం ఐదు గంటలకే 67.99 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం ఆరు గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఈసారి పోలింగ్‌ 80 శాతం దాటేలా కనిపిస్తోంది.

ఇక వర్షం పడుతున్నా, హింసాత్మక ఘటనలు జరుగుతున్నా లెక్కచేయక ఓటర్లు.. ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.13 కోట్లు కాగా.. సాయంత్రం ఐదు గంటలకు 2.71 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 64.28 శాతం, మహిళలు 66.84 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇక జిల్లాలవారీగా చూస్తే … సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం మేరకు… పోలింగ్‌ శాతం ఇలా ఉంది..

అల్లూరి సీతారామరాజు – 63.19 శాతం

అనకాపల్లి – 81.63 శాతం

అనంతపురం – 79.25 శాతం

అన్నమయ్య – 76.12 శాతం

బాపట్ల – 82.33 శాతం

చిత్తూరు – 82.65 శాతం

అంబేద్కర్‌ కోనసీమ – 83.19 శాతం

తూర్పు గోదావరి – 79.31 శాతం

ఏలూరు – 83.04 శాతం

గుంటూరు – 75.74 శాతం

కాకినాడ 76.37 శాతం

కఅష్ణా 82.20 శాతం

కర్నూలు 75.83 శాతం

నంద్యాల 80.92 శాతం

ఎన్టీఆర్‌ 78.76 శాతం

పల్నాడు 78.70 శాతం

పార్వతీపురం మన్యం 75.24 శాతం

ప్రకాశం 82.40 శాతం

పొట్టిశ్రీరాములు నెల్లూరు 78.10 శాతం

శ్రీ సత్యసాయి 82.77 శాతం

శ్రీకాకుళం 75.41 శాతం

తిరుపతి 76.83 శాతం

విశాఖపట్నం 65.50 శాతం

పశ్చిమ గోదావరి 81.12 శాతం

వైఎస్సార్‌ 78.12 శాతం

అత్యధికంగా డాక్టర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 83.19 శాతం పోలింగ్‌ నమోదయింది.

అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19 శాతం నమోదయింది.

➡️