ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కచ్చితంగా పోరాటం చేస్తా : ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి: కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కచ్చితంగా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. మంగళగిరిలో తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ అమరావతికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో ఎప్పుడూ కేసులు వేయలేదన్నారు. రాజధాని విషయంలో తన నిర్ణయాన్ని కాంగ్రెస్‌లో చేరిన వెంటనే అందరికీ చెబుతానని తెలిపారు. వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన వెంటనే తాను కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పారు. ఆర్కే ఇటీవల ఎమ్మెల్యే పదవికి, వైసిపి సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

➡️