విజయవాడ : బాబూరావు నామినేషన్ ర్యాలీ శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని పైపులరోడ్డు సెంటర్, సింగ్నగర్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ …. బిజెపితో వైసిపి జతకట్టి విధ్వంసాన్ని సృష్టిస్తున్న విధానాన్ని ఓడించాలని కోరారు. వైసిపి, టిడిపి, జనసేనలు కలిసి బిజెపితో అంటకాగి రాష్ట్ర ప్రయోజనాలను మంటగలుపుతున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ఆద్మి ఇండియా వేదిక పార్టీలు బలపరిచిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబూరావును ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.