యూఏఈ : తియ్యటి ఆరోగ్యకరమైన ఖర్జూరపు పండు అంటే ఇష్టపడనివారుండరు. ఖర్జూరంలో ప్రోటీన్స్, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇలాంటి నేచురల్ స్వీట్ ఫ్రూట్స్ను గ్రామాల్లో నేరుగా చెట్ల నుంచి తీసుకొని తింటారు. ఇక పట్టణ, నగరాల్లో ప్రజలు కొనుక్కొని తింటారు. చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఖర్జూరాను తప్పక తింటారు. అయితే ఖర్జూరంతో కరెంట్ ను తయారు చేయవచ్చు.. అవునండీ… యూఏఈకి చెందిన ముగ్గురు ఇంజనీర్లు ఓ అద్భుతం చేశారు. ఖర్జూరం నుంచి విద్యుత్ తయారు చేశారు..!
ఎమిరాటీ ఇంజనీర్లు, కళాకారుల బృందం… డాక్టర్ అల్ అత్తర్, ఒమర్ అల్ హమ్మది, మహమ్మద్ అల్ హమ్మదీ అనే ముగ్గురు సాంప్రదాయమైన మజ్దూల్ ఖర్జూరాలను ఉపయోగించి విద్యుత్ను తయారుచేసి వాహ్ వా..! అనిపించారు. ఈ ఆవిష్కరణ ఘనత ఆ ముగ్గురికి చెందుతుంది. మజ్దూల్ ఖర్జూరాలు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. రాగి పలకలను గట్టిగా పట్టుకోగలవు. ఈ ప్రక్రియ ఉద్దేశ్యం ఖర్జూరంలోని స్వచ్ఛమైన చక్కెరను స్పష్టమైన జీవశక్తిగా మార్చడం.
ప్రయోగం ఎలా చేశారంటే …
డాక్టర్ అల్ అత్తార్, ఒమర్ అల్ హమ్మదీ, మహమ్మద్ అల్ హమ్మదీ ఖర్జూరంలో రాగి పలకలను పొందుపరిచారు. వీటిని వాహక లోహపు తీగతో అనుసంధానించారు. మోడల్ కోసం 20 ఖర్జూరాలను వాడారు. మెటల్ వైర్లు సర్క్యూట్ను పూర్తి చేస్తున్నప్పుడు రాగి ప్లేట్లు ఎలక్ట్రోడ్లుగా పనిచేస్తాయి. సెటప్ చిన్న మొత్తంలో విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది.
అద్భుత ఆలోచన ఇలా పుట్టింది…
తన అద్భుత సఅష్టి వెనుక ఉన్న ప్రేరణను వివరిస్తూ … స్థానిక అరబ్ సంస్కఅతిలో ఖర్జూరాలకు గొప్ప ప్రాముఖ్యత ఉందని మహమ్మద్ అల్ హమాది అన్నారు. ఖర్జూరంలో దాగి ఉన్న మరికొన్ని లక్షణాలను కనుగొనే క్రమంలో ఈ ప్రయోగం చేయాలనే ఆలోచన వచ్చిందని ఆ ముగ్గురు ఇంజనీర్లు తెలిపారు. సిక్కా ఆర్ట్ అండ్ డిజైన్ ఫెస్టివల్లో ముగ్గురు తమ ప్రాజెక్ట్లను ప్రదర్శించారు.