ఇంటర్నెట్డెస్క్ : టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టికి రోడ్డు ప్రమాదంలో గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయన కొద్దిరోజుల క్రితం అమెరికాకు వెళ్లాడని, అతనికి అక్కడే బైక్ యాక్సిడెంట్ అయ్యి తీవ్ర గాయాలైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ ప్రమాదంలో నవీన్కి చేయి విరిగిందని, డాక్టర్లు రెండునెలల పాటు విశ్రాంతి అవసరమని చెప్పినట్లు సోషల్మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదం గురించి తెలియగానే నవీన్ తల్లిదండ్రులు కూడా అమెరికాకు పయనమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం గురించి తెలియగానే నవీన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, నవీన్ తాజాగా ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నవీన్కి జోడీగా హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పటివరకు నవీన్ అప్డేట్ ఇవ్వలేదు. త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వనున్నారని సమాచారం.