కాజీపేట (తెలంగాణ) : పిట్టను కొట్టబోతే ఆ రాయి కాస్తా వందేభారత్ రైలుకు తగిలి అద్దం పగిలింది… ఇంకేముంది ఆ ముసలాయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్ సిఐ సంజీవరావు వివరాల మేరకు … జనగామకు చెందిన హరిబాబు పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుంటుంటారు. ఇందులో భాగంగా జనగామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం పిట్టలను కొట్టడానికి గులేరుతో ప్రయత్నించినప్పుడు పొరపాటున రాయి వెళ్లి అప్పుడే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న 20833 నంబరు వందేభారత్ ఎక్స్ప్రెస్కు తగలడంతో అద్దం పగిలింది. కేసు నమోదు చేసి సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో విచారించగా హరిబాబు చేసిన పని అని తేలింది. వెంటనే పోలీసులు సంజీవరావును అరెస్టు చేశారు. గులేరును సీజ్ చేశారు. అయ్యో … పిట్టను కొట్టబోతే పొరపాటున గులేరులో ఉన్న రాయి వందేభారత్ ఎక్స్ప్రెస్కు తాకిందని, తన తప్పేమీ లేదని జనగామ అంబేడ్కర్ నగర్కు చెందిన హరిబాబు (60) వాపోయారు.