సీజ్ చేసిన పాస్టిక్ బాటిల్ తయారీ పరిశ్రమ
రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని వాల్మీకి నగర్ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాస్టిక్ బాటిళ్లు తయారు చేసే ఫ్యాక్టరీని సీజ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ పి.కిషోర్ తెలిపారు. పట్టణ పొలిమేరలోని ఒక గోదాములో ప్లాస్టిక్ బాటిళ్లను తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు విచారణలో తేలడంతో సీజ్ చేసినట్లు తెలిపారు.