ప్రజాశక్తి-గంపలగూడెం: జిల్లాలో సుప్రసిద్ధ దేవాలయంగా పేర్కొంటున్న నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారిని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. బుధవారం పురోహిత బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/Krishna-Prasad-couple-who-visited-Venugopal.jpg)