దీక్షల్లో పాల్గొన్న న్యాయవాదులు
ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు బార్ అసోసియేసన్ న్యాయవాదులు మంగళవారం గుంటూరు జిల్లా కోర్టు ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షల్లో మొదటిరోజు గురజాల అనురాధ, వి.ఉషాకిరణ్రెడ్డి, లావు కిరణ్మయి, నల్లూరి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ ప్రజాహక్కులకు వ్యతిరేకమైన ఈ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. నేడు న్యాయవాదులు ప్రదర్శనగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో ప్రతి న్యాయవాది హాజరు కావాలని పిలుపునిచ్చారు. దీక్షల్లో ఉద్యమ కమిటీ సభ్యులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.