హైదరాబాద్ : హైదరాబాద్లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. పాతబస్తీ భవానీ నగర్ పరిధిలో కొంతమంది యువకులు రైలు పట్టాలపై గ్యాంగ్ వార్కు దిగారు. గొడవల మత్తులో ట్రైన్ వచ్చేది కూడా గమనించలేదు. దీంతో ట్రైన్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఇలాంటి గ్యాంగ్ వార్లు కామన్గా మారాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.