ప్రజాశక్తి-పెరవలి మండలం(తూర్పుగోదావరి జిల్లా) : సామాజిక సమత సంకల్ప సభకు నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు మండలం నుండి ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడలో నేడు సామాజిక న్యాయ మహా శిల్పం భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమ సమాజ స్ఫూర్తి భారత రాజ్యాంగ రూప శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సామాజిక సమత సంకల్ప సభకు 8 బస్సుల్లో 272 మంది వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎంపీపీ కె. సీతారాం ప్రసాద్ మండల అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణ జడ్పిటిసి కొమ్మిశెట్టి రామాంజని, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పొట్టి రాంబాబు, జెయస్ వి కన్వీనర్ రామడుగుల సూర్యనారాయణ, దావులూరి శ్రీనివాస్, సర్పంచ్ లు గారపాటి నాగభూషణం, భావన, మధు, బీరా సత్యవేణి, రాజు, వైసిపి నాయకులు యువత తరలివెళ్ళారు.