ఆసరా ప్రోగ్రాంకు హాజరుకావద్దంటూ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
ప్రజాశక్తి-రాయదుర్గం : గుమ్మగట్టలో జరగబోయే వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాంకు తాను కూడా వస్తానని అడిగినందుకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మెట్టు గోవిందరెడ్డి ఏపీఐఐసీ చైర్మన్గా ప్రస్తుతం లేనందున మాజీ ఎమ్మెల్యేగా మెట్టు గుమ్మగట్టలో జరగనున్న ఆసరా కార్యక్రమానికి హాజరయ్యే పక్షంలో తాను కూడా మాజీ ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం ఆసరా కార్యక్రమానికి హాజరవుతారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పోలీసులకు తెలిపారు. ప్రోటోకాల్ ఎవరికైనా ఒకటే కదా అని పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులకు మాజీ మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమానికి హాజరు కాకూడదని కాలువకు నోటీసులను ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు అందజేశారు.