ముంబయి : షాపూర్జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన నిర్మాణ, ఇంజినీరింగ్ కంపెనీ ఆప్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఐపిఒకు సిద్దం అయ్యింది. ఇందుకోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.7,000 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులోని రూ.150 కోట్లు మూలధన వ్యయానికి, నిర్వహణ మూలధనం వ్యయం కోసం రూ.350 కోట్లు, రూ.500 కోట్లు రుణ చెల్లింపులకు ఉపయోగించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.