న్యూఢిల్లీ : దేశంలో స్మార్ట్ టివిల ధరలు పెరగొచ్చని కౌంటర్ పాయింట్స్ ఐఒటి సర్వీస్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో టివిల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషించింది. దేశీయంగా ప్రీమియం మాడళ్లకు డిమాండ్ అధికంగా ఉంది. ధరలు పెరిగినప్పటికీ స్మార్ట్ టివి దిగుమతులు 9 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయని తెలిపింది. దేశ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండటంతో గతేడాది టివిల దిగుమతుల్లో 16 శాతం పతనం కనబడింది.