ఫొటో : మాట్లాడుతున్న కావలి డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు
ఆర్టిసికి రూ.6.6 లక్షలు ఆదాయం
ప్రజాశక్తి-కావలి : కొండబిట్రగుంట తిరునాళ్ల సందర్భంగా ఎపిఎస్ ఆర్టిసి కావలి డిపోకు రూ.6,57,597 ఆదాయం వచ్చిందని డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లో సాధారణ ఛార్జీలతో 24 బస్సులు నడుపగా, గత సంవత్సరం కంటే రూ.58156 అధిక ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. గత సంవత్సరం కిలోమీటర్కు 59.39 రూపాయల ఆదాయం రాగా, ఈ సంవత్సరం 67.54 రూపాయలు వచ్చిందన్నారు.ఈ సందర్భంగా అంకితభావంతో విధులు నిర్వహించిన ఆర్టిసి సిబ్బందికి, కొండబిట్రగుంట శ్రీ ప్రసన్నవెంకటేశ్వర స్వామి దేవస్తానం చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు, తమ బస్సు సర్వీసులను ఆదరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.