ఐవీఎం సంస్థ ఆధ్వర్యంలో ట్రై సైకిల్‌ పంపిణీ

Jan 7,2024 16:00 #Krishna district

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి మండలం పుటిగడ్డలో ఇండియా విలేజ్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో ట్రై సైకిళ్లు వీల్‌ చైర్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశ్రాంత డిఎస్‌పి పీకే హరి రాజేంద్రబాబు మాట్లాడుతూ.. నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడంలో, విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతను ఇవ్వడంలో సేవా దృక్పథం గల సంస్థ ఐవీఎం అని విశ్రాంత డి.ఎస్‌.పి కె.హరిరాజేంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎం ట్రస్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వేములపల్లి సురేష్‌, సభ్యులు ఎన్‌.ఫణి, పి.రాజేష్‌, జి.ప్రసాద్‌లు పాల్గొన్నారు.

➡️