కడియంలో ట్రైనీ కలెక్టర్ల పర్యటన

ట్రైనీ కలెక్టర్లు

ప్రజాశక్తి-కడియంకడియం మండలంలో ట్రైనీ కలెక్టర్లు పి.సువర్ణ, ఎం.భానుప్రకాష్‌ రెడ్డి బుధవారం పర్యటించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం, కడియం సచివాలయం-1, వేమగిరి సచివాలయం-4ను వారు సందర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ విధంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి, ఎదురయ్యే సమస్యలపై సచివాలయాల ఉద్యోగులను, గ్రామ వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయుస్మాన్‌ భారత్‌, చేదోడు, చేయూత, అమ్మ ఒడి తదితర సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు ప్రజలకు చేరుతుందోనని పరిశీలించారు. వేమగిరి సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ విధానాన్ని పరిశీలించారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రిజిస్ట్రేషన్లు జరిగే తీరును ఆరా తీశారు.

➡️