ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ కార్పొరేషన్లోని ఐదవ పారిశుద్ధ్య సర్కిల్లో ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న ఇట్టి కుల్లాయప్ప ఎట్టి కుల్లాయప్ప ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో కార్మికులు తమ వంతు సహాయంగా 96,000 రూపాయలు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కమిషనర్ మేఘ స్వరూప్ చేతుల మీదుగా కుళ్లాయప్ప కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. కార్మికులు అందరూ తమ ఒక్కరోజు వేతనం 400 రూపాయలు చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ , సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏటీఎం నాగరాజు,కే నాగభూషణం, రెగ్యులర్ ఉద్యోగ సంఘం నగర అధ్యక్ష కార్యదర్శులు ఎల్ ముత్తరాజు, ఎం నల్లప్ప జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ మూర్తి, నగర అధ్యక్షులు బండారి స్వామి, నగర ట్రెజరర్ లక్ష్మీనరసమ్మ, ఇంజనీరింగ్ సెక్షన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున, రాయుడు, నగర కార్యదర్శి, మురళి,నగర కమిటీ సభ్యులు,ప్రభాకర్, రాఘవేంద్ర ప్రసాద్, నల్లప్ప, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.