ప్రజాశక్తి-హనుమంతునిపాడు: మండలంలోని నందనవనం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కనిగిరి నియోజకవర్గ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నందనవనం టీం క్రీడాకారులకు కాపు సంఘ ఉపాధ్యక్షులు పెంచికల రామకృష్ణ, కల్లూరి సూర్యం క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.