ప్రజాశక్తి – ఉంగుటూరు
భారీ వర్షాలకు ఉంగుటూరు మండలం గొల్లగూడం ఎస్సి కాలనీలో తాటాకిళ్లులు, పెంకుటిళ్లులు కూలిపోయినట్లు విఆర్ఒ ఉండ్రాజవరపు చంద్రబాబు వెల్లడించారు. బాధితులను పునరావాస కేంద్రానికి తరలించి వారికి భోజన, వసతి ఏర్పాట్లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి యాళ్ల కిషోర్బాబు, వైసిపి గ్రామ నాయకుడు మలకపల్లి నాగు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు సహాయ చర్యలు చేపట్టారు.