జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయి : పద్మశ్రీ

ప్రజాశక్తి – జంగారడ్డిగూడెం

జల జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తామని ఎంఎల్‌ఎ ఎలిజా, ఉమ్మడి జిల్లా జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ తెలిపారు. గురువారం మండలంలోని శ్రీనివాసపురంలో పలు అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. ఈ క్రమంలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో ఓవర్‌ హెడ్‌ నీటి ట్యాంక్‌, రూ.21 లక్షల అంచనాతో జిల్లా ప్రజా పరిషత్‌ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే జగనన్న కాలనీలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక జెడ్‌పిటిసి సభ్యులు పోల్నాటి బాబ్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు మేకా శేషుబాబు, శ్రీనివాసపురం సర్పంచి యడ్లపల్లి రాధిక, స్థానిక వైసిపి నాయకులు మేడవరపు సాగర్‌, మండవల్లి సోంబాబు, బివిఆర్‌.చౌదరి పాల్గొన్నారు.

➡️