టిడిపి పాలనలో ఎన్ని రోడ్లు వేశారు..?

Nov 22,2023 23:20
ప్రభుత్వ పాలనలో

ప్రజాశక్తి – జగ్గంపేట రూరల్‌ టిడిపి ప్రభుత్వ పాలనలో జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్ని రోడ్డు వేశారని జిల్లా జెసిఎస్‌ కో-ఆర్డినేటర్‌ ఒమ్మి రఘురాం ప్రశ్నించారు. స్థానిక సచివాలయం-1లో బుధవారం వై ఎపి నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ టిడిపి పాలనలో రోడ్లు వేయకుండా జగన్‌ ప్రభుత్వంపై నెట్టడం వల్లే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ జ్యోతుల నెహ్రూ గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టిడిపి పాలనలో వేసిన రోడ్లు రెండేళ్లకే గుంతలు పడ్డాయా? అని ప్రశ్నించారు. వీటికి టిడిపి నాయకులే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తొలుత సచివాలయం వద్ద పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి ఒమ్మి బిందు మాధవి, ఎంపిడిఒ వసంత్‌ కుమార్‌, ఎంపిటిసి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

➡️