ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రపంచం దివ్యంగుల దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైసిపి దివ్యాంగుల విభాగం, శ్రీ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగుల జీవనోపాధి కోసం కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి కొలగట్ల వీరభద్ర స్వామి, వైసిపి విజయనగరం జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పాల్గొని దివ్యాంగులకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కొండబాబు, విజయదుర్గా తదితరులు పాల్గొన్నారు.