న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా హరీష్‌

Mar 28,2024 21:36

ప్రజాశక్తి-విజయ నగరం లీగల్‌ : స్థానిక న్యాయ వాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షుడిగా అల్లాడ హరీష్‌ ఎన్నికయ్యారు. గురువారం న్యాయ వాదుల సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సంఘం లో మొత్తం 549 మంది సభ్యత్వం కలిగి ఉండగా, 473 మంది ఓటు హక్కు వినియోగించు కున్నారు. అధ్యక్ష పదవికి పోటీలో నిలిచిన అల్లాడ హరీష్‌కు 281 ఓట్లు రాగా ప్రత్యర్థులు కంటు భుక్త శ్రీనివాసరావు కు 172 ఓట్లు , సరిపల్లి నాగేశ్వరరావుకు 8 ఓట్లు వచ్చాయి. 109 ఓట్ల మెజార్టీతో హరీష్‌ గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా దాసరి ఈశ్వర రావు, సంయుక్త కార్యదర్శిగా ఎర్రసూరి పైడి వెంకట రమణ మూర్తి, కోశాధికారిగా బీంపల్లి రవి గెలు పొందారు. ఎన్నికల అధికారులుగా పెంట శ్రీరామ మూర్తి , కలిశె ట్టి రవిబాబు, ఎవిఎల్‌ పద్మజ ధువీకరిస్తూ పత్రం అందజేశారు. గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులను మాజీ అధ్యక్షుడు సిహెచ్‌ దామోదర రామమోహనరావుతో న్యాయ వాదులు అభినందించారు.

➡️