పేదలకు సాగుభూమి కల్పనే ప్రభుత్వ లక్ష్యం

ప్రజాశక్తి – కురుపాం : భూమిలేని పేద రైతులకు సాగు భూమిని కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గురువారం చినమేరంగి తన అతిథిగృహంలో నియోజకవర్గంలో గల ఐదు మండలాల్లో సాగు భూమిలేని 1070 మంది పేద రైతులకు 830 ఎకరాల డికెటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన పని చేస్తూ అర్హులకు అన్ని సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని అటువంటి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసరమైన రాజకీయ బురద జల్లుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ మరిశర్ల బాపూజీనాయుడు, ఎంపిపిలు శెట్టి పద్మావతి, కుంబరిక దీనమయ్య, ఉరిటి రామారావు, జిల్లా కోప్సన్‌ సభ్యులు షేక్‌ నిషార్‌, ఐదు మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️