మరోసారి మోసగించేందుకు బస్సుయాత్ర

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలను మరో సారి మోసగించేందుకు వైసిపి సామాజిక సాధికార బస్సుయాత్ర చేపట్టిందని టిడిపి నేతలు విమర్శిం చారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు ఆదేశాలమేరకు వైసిపి ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను ఖండిస్తూ ఒంగోలులోని నియోజకవర్గ టిడిపి కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద బుధవారం నల్ల బెలూన్లతో నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో చుండి శ్యామ్‌, ఎద్దు శశికాంత్‌ భూషణ్‌, పి హగ్గయ్య రాజ్‌, బండారు మదన్‌, నాళం నరసమ్మ, జగన్నాధం రామారావు, టి రమాదేవి, షేక్‌ అన్వర్‌ బాషా, టి రమాదేవి, షేక్‌ ఆరిఫా, బీరం అరుణ, నావూరి కుమార్‌ టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️