మోకాళ్లపై మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 9,2024 14:44 #Kakinada

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్‌(కాకినాడ) : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సామర్లకోట మున్సిపల్‌ కార్మికులు ఏడో రోజు సమ్మెలో భాగంగా మోకాళ్లపై కూర్చుని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన తెలియజేశారు. తమ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మోకాళ్లపై కూర్చుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ, సీనియర్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎలిసెట్టి రామదాసు, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు బోచ్చా శ్రీను ,కసింకోట ఆనందరావు, గూడుపు దాలమ్మ, మల్లవరపు శకుంతల, గూడుపు అనిత, బంగారు కొండ, గౌరం శెట్టి రమనమ్మ, అర్జి అప్పల నరసమ్మ,శింగంపు భవానీ, వాసపల్లి అప్పారావు, శిరంశెడ్డి వెంకటేష్‌, మిరియాల రాజ, ఏలుపులు మల్లికార్జున తదితరులు, కార్మికులు పాల్గొన్నారు.

➡️