వధూవరులను ఆశీర్వదిస్తున్న దృశ్యం
వధూవరులకు ఆశీర్వాదం
ప్రజాశక్తి – వలేటివారిపాలెం మాలకొండ గ్రామంలో బుధవారం జరిగిన ముతకని వారి వివాహ వేడుకకు కందుకూరు వైసిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులైన మాధురి, బాలాజీలను ఆశీర్వదించారు. ఆయన వెంట చుండి సర్పంచ్ ఇరపని సతీష్, ఎంపిటిసి యానాది, మండల పార్టీ అధ్యక్షుడు పరిటాల వీరాస్వామి, ఇరపని సత్యనారాయణ, యాళ్ళ హరి బ్రహ్మ రెడ్డి, శివ కుమార్ రెడ్డి, కుంబాల క్రాంతి కుమార్, కుమ్మరి మాల్యాద్రి, కట్టా హనుమంతరావు, టెంకం కొండలరావు ఉన్నారు.
![వధూవరులకు ఆశీర్వాదం](https://prajasakti.com/wp-content/uploads/2024/03/burra.jpg)