ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమ పాలన, స్థానికంగా తాము చేసిన నగరాభివృద్ధే తమ విజయానికి సోపానాలుగా నిలవనున్నాయని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. గురువారం జమ్ము ప్రాంతంలో జరిగిన ఇంటింటి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు కోలగట్ల సమక్షంలో వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వారిని ప్రజలు ఎన్నుకోవాలని, ఎన్నికల అప్పుడే కనిపించే నాయకులను దూరంగా పెట్టాలని అన్నారు. టిడిపి నాయకులు లేనిపోని ఆరోపణలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. అయితే తమపై ఎన్ని ఆరోపణలు చేసిన రుజువు చేయలేరని, తాము ధైర్యంగా ప్రజల వద్దకు వెళుతున్నామని అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో గుర్తించిన అభివద్ధి పనులను పూర్తి చేసామన్నారు.కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, రాష్ట్ర పరిశ్రమల అభివద్ధి మండలి డైరెక్టర్ బంగారనాయుడు, స్థానిక కార్పొరేటర్ ఆల్తి సత్యకుమారి, ఎఎంసి చైర్మన్ నడిపేన శశి భార్గవి, జోనల్ ఇన్చార్జిలు బొద్దాన అప్పారావు, రెడ్డి గురుమూర్తి,బోడసంగి ఈశ్వర రావు, పొంతపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.