ప్రజాశక్తి-వేటపాలెం: వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురం గ్రామంలో 10 కుటుంబాలు సోమవారం ఆమంచి కృష్ణమోహన్ సమక్షంలో చేరారు. కొల్లుకుల శ్రీను, సోమశేఖర్, పవన్ కుమార్, బాలసుబ్రమణ్యం, హేమచంద్రరావు నివాసంలో చీరాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాచర్ల మూర్తిలింగం, సోమశేఖర్, పవన్ కుమార్, బాలబ్రహ్మం, హేమసుందర్రావులు ఆయనను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బండ్ల బాబు, కర్ణ ఇందు శంకర్, గుత్తి రామలింగా వరప్రసాద్, గుంటూరు సాంబశివరావు, దంతం గోపాలకృష్ణ, పింజల గోవర్ధన్, గుత్తి మల్లయ్య, లీల రఘునాథరావు, పృథ్వీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.