18వ వార్డులో ప్రచారం ప్రారంభం

Mar 27,2024 21:33
ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న కావ్యక్రిష్ణారెడ్డి

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న కావ్యక్రిష్ణారెడ్డి
18వ వార్డులో ప్రచారం ప్రారంభం
ప్రజాశక్తి-కావలి : కావలి అసెంబ్లీ టిడిపి ఎంఎల్‌ఎ కావ్య క్రిష్ణారెడ్డి బుధవారం 18వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 18వ వార్డు ఇన్‌ఛార్జి శానం హరి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. యువత బాణా సంచాపేలుస్తూ సంబరాలు నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఒక్క అవకాశం కల్పించి ఎంఎల్‌ఎగా తనను, ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఆశీర్వదించాలని క్రిష్ణారెడ్డి కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️