25 కుటుంబాలు టీడీపీలో చేరిక

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో గడికోట పంచాయతీ మాజీ సర్పంచులు ముచ్చుకుండ్ల రామసుబ్బయ్య, మందగిరి రంగస్వామి, దూదేకుల నరసింహులు ఆధ్వర్యంలో దేవనగరం గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు మెంబర్లతో సహా 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి అశోక్‌రెడ్డి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో స్థానికంగా ఉండే అశోక్‌రెడ్డి గెలుపు కోసం వారు కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వార్డు మెంబర్లు తాళ్ల శ్రీనివాసులు, కసినా వెంకటేశ్వర్లు తాళ్ల బాల గురువయ్య నల్లమేకల రమణయ్య మందగిరి తిరుపతయ్య, తానం శ్రీధర్‌, గుర్రపుసాల వెంకట రమేష్‌, తాళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️