రోడ్డుపై యువకుడి మృతదేహం

కురిచేడు (ప్రకాశం) : రోడ్డుపై యువకుడి మృతదేహం కనిపించిన ఘటన మంగళవారం కురిచేడు మండలంలో జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పెనగమూరు కాలనీ దగ్గర గుర్తు తెలియని యువకుడు మఅతి చెంది పడి ఉండటాన్ని గుర్తించారు. ఓవైపు బైక్‌ మొత్తం నుజ్జు నుజ్జు గా మారి పక్కనే పడి ఉంది. దర్శి కి చెందిన యువకుడు కురిచేడుకు వెళుతున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️