టంగుటూరు (ఏలూరు) : అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం (ఎబిపిఎస్) అధ్యక్షులు గద్దె జడ్సన్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి 9 గంటల సమయంలో టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం ఫ్లైఓవర్ పై జరిగింది. హోండా గ్లామర్ ఎపి 27ఎఎం0828 బైక్ పై గద్దె జడ్సన్ ఒంగోలుకు వెళుతుండగా, సూరారెడ్డిపాలెం ఫ్లైఓవర్ పై గుర్తు తెలియని వాహనం, బైక్ను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో గద్దె జడ్సన్ మరణించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. టంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
ABPS అధ్యక్షులు గద్దె జడ్సన్ రోడ్డు ప్రమాదంలో మృతి
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/died.jpg)