భారత చైతన్య యువజన పార్టీ నరసాపురం అసెంబ్లీ అభ్యర్థి గా ఆకుల వెంకట స్వామి

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా) : భారత చైతన్య యువజన పార్టీ నరసాపురం అసెంబ్లీ అభ్యర్థి గా ఆకుల వెంకట స్వామి పేరు ప్రకటించారు. ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ మొదటి జాబితాలో వెంకటస్వామికి టిక్కెట్‌ కేటాయించారు. గతంలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలీగల్‌ సెల్‌ ఉపాధ్యక్షులుగా, నరసాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌ గా పనిచేశారు. అనంతరం పార్టీలో నచ్చక ఆయన రాజీనామా చేశారు. నరసాపురం లో కౌన్సిలర్‌, న్యాయవాదిగా పనిచేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆకుల వెంకట స్వామి.

➡️