కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి

  • చలివేంద్రం ప్రారంభంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయవాడ : గవర్నర్‌ పేటలో టూ వీలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మెకానికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ విధంగా కార్మికులందరూ ఏకమై సోషల్‌ రెస్పాన్సిబిలిటీ పెంచుకొని ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే ప్రభుత్వాలు వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. టూ వీలర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఆంజనేయ దాస్‌ మాట్లాడుతూ. ఈ కార్యక్రమం ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ మజ్జిగ, సుగంది నీళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జయరాం, అసోసియేషన్‌ జిల్లా ప్రైసెడెంట్‌ ఫిరోజ్‌, జిల్లా, సిటీ, టూ వీలర్స్‌ అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️