ప్రజాశక్తి,-వి ఆర్ పురం
మండలంలోని రామవరం జోన్, చొప్పపల్లి గ్రామంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. రంపచోడవరం సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు, అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పల నరసయ్య గెలుపు కోరుతూ ఈనెల 9న జరిగే ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనేం సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కారం సుందరయ్య, పంకు సత్తిబాబు, కుంజా నాగిరెడ్డి, వడ్లాది రమేష్, శ్రీరామ గిరి శాఖ కార్యదర్శి గుండుపూడి లక్ష్మణరావు,పార్టీ నాయకులు పులి బుజ్జి, కన్నయ్య,దూలయ్య, కారం సత్తిబాబు, దేసయ్య తదితరులు పాల్గొన్నారు.