ప్రజాశక్తి-పాడేరు:తలారిసింగి గిరిజన సంక్షేమ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని సోమవారం సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగుల కోసం ఈ నెల 5 నుంచి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రం, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లపై ప్రభుత్వ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా సద్వినియోగం చేసుకొని ఓటు వేయాలన్నారు. అంతకు ముందుడిగ్రీ కళాశాలలో ఏర్పాటు స్ట్రాంగ్ రూమును సందర్శించారు.