రహదారి గోతులమయం-

అవస్థలు పడుతున్న వాహనదారులు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలో రహదారులు గోతులమయం కావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పాడేరు నుండి జోలపుట్టు వెళ్లే ఆర్‌ అండ్‌ బి ప్రధాన రహదారి ముంచింగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ చోటముక్కి ఫుట్‌ ప్రధాన అస్తవ్యస్తంగా ఉంది. ఈ రహదారిలో నిర్మించిన కల్వర్టు వద్ద గుంతలు ఏర్పడి అస్తవ్యస్తంగా ఏర్పడి ప్రమాదాలకు దారి తీస్తోంది. పలుమార్లు ప్రమాదాలు జరిగి పలువురు తీవ్రగాయాలు పాలైన ఘటనలు ఉన్నాయి. భారీ గుంతలు ఏర్పడి ఉండటంతో వరద నీరు చేరి ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ద్విచక్ర వాహన చోదకులు బోల్తా పడి ఆసుపత్రి పాలవుతున్నారు. అధికారులు స్పందించి కల్వర్టు వద్ద గుంతలు పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహన చోదకులు, ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

➡️