ప్రజాశక్తి-రొద్దం (అనంతపురం) : ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలకు ఎంపికైనట్లు విద్యార్థి తల్లిదండ్రులు బుధవారం తెలిపారు. బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు ఈ నెల 10న హిందూపురంలో నిర్వహించారు. దీంతో మండలంలోని దొడగట్ట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆ పరీక్షల్లో పాల్గని ప్రతిభ కనపరిచారు. పాఠశాలలో 4 వ తరగతి చదువుతున్న డి.మధుశ్రీ, ఎచ్.హేమశ్రీ హిందూపూర్ అంబేద్కర్ గురుకులానికి ఎంపిక కాగా, ఏ.హేమశ్రీ అమరాపురం గురుకులానికి ఎంపికయ్యారు. దీంతో విద్యార్థులు ప్రవేశ పరీక్షలో సీట్లు పొందినందుకు తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు హరీష్, తేజ కఅషిని గ్రామస్థులు అభినందించారు.