క్యాలెండర్లను ఆవిష్కరిస్తున్న జెవివి నాయకులు
అనంతపురం కలెక్టర్ : జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన క్యాలెండర్ను సోమవారం స్థానిక జెవివి జిల్లా కార్యాలయంలో జెవివి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకట రామిరెడ్డి, లక్ష్మీనారాయణ, జెవివి రాష్ట్ర నాయకులు సాకే.భాస్కర్, జిల్లా నాయకులు జిలాన్, జగదీష్, చిత్తప్ప, రామిరెడ్డి, ముత్యాలు, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.