పంట పొలాల పరిశీలన

రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ

రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ

 

ప్రజాశక్తి-ఉరవకొండ

విడపనకల్లు మండల పరిధిలోని కొట్టాలపల్లిలో రైతులు సాగు చేసిన పంట పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ గురువారం పరిశీలించారు. ఇందులో భాగంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నారాయణరెడ్డి నాలుగెకరాల పొలంలో సాగుచేసిన కంది పంటను పరిశీలించి దిగుబడి వచ్చిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టపరిహార నివేదికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెన్నరాయుడు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణిని కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ డివిజన్‌ ఎడిఎ పద్మజ, మండల వ్యవసాయ అధికారి పెన్నయ్య, రైతు భరోసా సిబ్బంది శివ, లత, ముత్యాలు, లక్ష్మన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.

➡️