ప్రజాశక్తి – పుట్లూరు(అనంతపురం జిల్లా) : అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమ్మె 36వ రోజుకు చేరుకుని ప్రశాంతంగా సమ్మె కొనసాగుతున్నది. సిపిఎం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు కాబట్టి ఇచ్చిన హామీలే అడుగుతున్నారని అన్నారు. రత్నాలు కాదయ్యా దశ రత్నాలు అనే పేరుతో మాది ఒకటి చేర్చాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పుట్లూరు మండల కార్యదర్శి ఎస్ సూరి, ఏపీ రైతు సంఘం జి వెంకట చౌదరి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు టి పెద్దయ్య, కార్యదర్శి బి భాస్కర్ రెడ్డి, కెవిపిఎస్ నాగభూషణ్, ఐద్వా మండల కార్యదర్శి టి రేణుక అంగనవాడి మండల అధ్యక్షురాలు జయలలిత, అనంతలక్ష్మి, రమాదేవి, శశికళ, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తదితరులు సిఐటియు మండల నాయకులు పుణ్య పురుష వీర రాఘవరెడ్డి అహ్మద్ భాషా తదితరులు పాల్గొన్నారు.