జేఈఈలో మెరిసిన విద్యార్ధులకు సన్మానం

Feb 21,2024 11:10 #Anantapur District
Awarded to students who have excelled in JEE Main

ప్రజాశక్తి-హిందూపురం : ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్ పరీక్షలలో ప్రతిభ కనబరిచి 99.58 శాతం ఉత్తీర్ణ సాధించిన గగన్ శ్యామ్ రెడ్డిని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో ఉన్న సువర్ణ భారతి జూనియర్ కళాశాలలో ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు బాబావలి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇదే విధంగానే అన్ని పరీక్షలలో మంచి ఉత్తీర్ణతను సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సువర్ణ భారతి విద్యాసంస్థల అధినేత నీలకంటా రెడ్డి కళాశాల సిబ్బంది రాము మరియు విద్యార్థి సంఘం నాయకులు లిఖిత్ దేవరాజు మూర్తి పాల్గొన్నారు.

➡️