భారీ ఎత్తున తరలిన వెళ్లిన వైసిపి నాయకులు, కార్యకర్తలు..
ప్రజాశక్తి-నార్పల : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సిద్ధం సభకు నార్పల మండలం నుండి వైసీపీ సీనియర్ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నార్పల మండలం నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు సుమారు వందలాది వాహనాల్లో రాప్తాడు సిద్ధం బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. నార్పల మొత్తం వైసిపి కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది ఇటీవల కాలంలో వైసీపీ సింగనమల్ల నియోజకవర్గ సమన్వయకర్త నియామకంలో ఏర్పడిన అసంతృప్తితో నార్పల మండలం నుండి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సంబ శివారెడ్డికి సంబంధం లేకుండా వందలాది వాహనాల్లో వైసీపీ కార్యకర్తలు నాయకులు ముఖ్యమంత్రి సిద్ధం సభకు తరలివెళ్లారు. సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా ఇంతమంది నాయకులు వైసీపీ కార్యకర్తలు సమన్వయకర్త నియామకంపై తీవ్రమైన అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీపై అభిమానంతో భారీ ఎత్తున తరలి వెళ్లడంతో కార్యకర్తల అభిష్టానికి విరుద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యహరించారు అని సింగనమల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మార్పు కచ్చితంగా ఉంటుందని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా అంటున్నారు. రాష్ట్రంలో సెంటిమెంట్ నియోజకవర్గమైన సింగనమల రాజకీయాలు ఎటువంటి మార్పులు జరుగుతాయో వేచి చూడాల్సిందేనని పలువురు స్థానికులు అంటున్నారు.