పరిశోధనలకు సహకారం అందిస్తాం

సమావేశంలో పాల్గొన్న భారత రక్షణ మంత్రిత్వశాఖ శాస్త్రీయ సలహాదారు డా|| జి.సతీష్‌ రెడ్డి

       అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు చేపట్టే పరిశోధక ప్రాజెక్టులకు సహకారం అందిస్తామని జెఎన్‌టియు పూర్వ విద్యార్ధి, భారత రక్షణ మంత్రిత్వశాఖ శాస్త్రీయ సలహాదారు డాక్టర్‌ జి.సతీష్‌ రెడ్డి తెలియజేశారు. ఆదివారం సాయంత్రం అనంతపురం జెఎన్‌టియుకు వచ్చిన ఆయన వర్శిటీ అధ్యాపకులు, ఉన్నతాధికారులతో ఉపకులపతి జివిఆర్‌.శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జి.సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ తాను చదువుకున్న జెఎన్‌టియు కళాశాల అభివద్ధికి తోడ్పాటును అందిస్తామని అదే విదంగా పరిశోధన ప్రాజక్టులకు, కాన్పరెన్స్‌లు నిర్వహించడానికి సహకారం అందిస్తామని తెలిపారు. లేజర్స్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, సైబర్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ వంటి అంశాలపై గెస్ట్‌ లెక్చర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉపకులపతి జివిఆర్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్సిటి అభివద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం ఎల్లప్పుడూ ఉందని తెలిపారు. డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి వర్సిటీ అభివద్దికి తోడ్పాటును అందివ్వడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఎం.విజయకుమార్‌, ప్రిన్సిపాల్‌ ఎస్‌వి.సత్యనారాయణ, పూర్వ విద్యార్థులు రవి మారుతీ రెడ్డి, సి.రంగ నాయకులు, అల్యూమిని డైరెక్టర్‌ పి. సుజాత తదితరులు పాల్గొన్నారు.

➡️