ఐదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి..

ఐదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి..

దగ్గుపాటి ప్రసాద్‌కు గజమాలతో స్వాగతం పలుకుతున్న నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నియోజకవర్గానికి చేసిందేమి ప్రజలకు చెప్పాలని అనంతపురం అర్బన్‌ టిడిపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం నగర సమీపంలోని చంద్రబాబునాయుడు కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకావలను వివరించారు. ఈ సందర్భంగా ఆయనకు కాలనీలో అడగుడగునా పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే వికలాంగులకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. రుద్రంపేట పంచాయతీలో కనీస మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా సైకో పాలనను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

చంద్రబాబును విమర్శించే స్థాయి ‘అనంత’కు లేదు..

టిడిపి అధినేత చంద్రబాబుని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి లేదని దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును కుప్పంలో ఓడించడం కాదని, ముందు పులివెందులలో మీ పొద్దు మునిగిందని ఎద్దేవా చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఎంత సేవ చేశారో ప్రజలకు తెలుసు అన్నారు. నాడు దళితుడిని చంపిన అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లే చేసి మళ్లీ పార్టీలోకి తెచ్చుకున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, కూటమి ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

➡️