అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి : సిఐటియు

Nov 23,2023 15:49

ప్రజాశక్తి-ఉరవకొండ(అనంతపురం) : అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు ఉరవకొండ ప్రాజెక్ట్‌ యూనియన్‌ నాయకురాలు విజయ పేర్కొన్నారు. గురువారం విడపనకల్‌ మండలం ఎంపీపీ కరణం పుష్పవతి భీమ్‌ రెడ్డిని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలు ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు కనీస వేతనం అందజేయాలన్నారు. ఎవరికి పెండింగ్లో ఉన్న వేతనాలు బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు.సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ఎంపీపీ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ సంఘం నాయకులు జె.రాజమ్మ,జె.నిర్మాలాదేవి, వాణితదేవి, భారతి దేవి,లక్ష్మి,గాయిత్రీ దేవి,హేమలత పాల్గొన్నారు.

➡️