ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బోయిన పల్లెలోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో గురువారం కళాశాల స్పోర్ట్స్ ఇంచార్జి మధు ఆధ్వర్యంలో 2024 స్పోర్ట్స్ మీట్ ను అట్టహాసంగా ప్రారంభించారు. యువతీ యువకులకు వేరువేరుగా పోటీలు నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, షటిల్, త్రో బాల్, టెన్నికాయిట్, చదరంగం, క్యారమ్స్, లాంగ్ జంప్, హై జంప్, డిస్క్ త్రో, జావలిన్ త్రో, షాట్ పుట్, పరుగు పందాలు వంటి మొదలగు ఆటలు నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ మీట్ వారం రోజులపాటు జరగనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డి.స్వర్ణలత తెలిపారు. విద్యార్థులు క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని, క్రీడల వలన మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందని తెలియజేశారు. కళాశాల కార్యదర్శి చొప్ప గంగిరెడ్డి, కోశాధికారి అభిషేక్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎల్లారెడ్డి, చైర్మన్ రామచంద్రారెడ్డి లు స్పోర్ట్స్ మీట్ నిర్వాహకులను, క్రీడలలో ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులను అభినందించారు.